Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

మరో గులాబీ ఎమ్మెల్యేకు కరోనా!

తెలంగాణాలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు తాజా సమాచారం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బి. గణేష్ గుప్తా కరోనా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. నిన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, చికిత్స కోసం ఆయన ఆసుపత్రికి వెళ్లారు. బాజిరెడ్డితో ప్రైమరీ కాంటాక్టులో గల గణేష్ గుప్తాకు కూడా కరోనా పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. కరోనా సోకిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో గణేష్ గుప్తా మూడో నాయకుడు. జనగామ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలకు కరోనా సోకగా, కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Popular Articles