Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

దిల్లీ సీఎంకు కరోనా లక్షణాలు! రేపు వైద్య పరీక్షలు!!

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. రోజు రోజుకూ కరోనా వ్యాప్తితో దిల్లీ అతలాకుతలాం అవుతున్న పరిస్థితుల్లోనే కేజ్రీవాల్ అస్వస్థతకు గురి కావడం గమనార్హం. ఆదివారం మధ్యాహ్నం నుంచే ఆయన జ్వరం, గొంతునొప్పితో తీవ్రంగా బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ స్వీయ నిర్బంధలోకి వెళ్లారు. కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని కరోనా లక్షణాలుగా అనుమానిస్తున్నారు. దీంతో మంగళవారం దిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా టెస్టు చేసే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా నివేదిస్తోంది.

Popular Articles