Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

కరీంనగర్ పోలీస్ శాఖలో కరోనా కల్లోలం

కరీంనగర్ పోలీసులను కరోనా వైరస్ తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. ముఖ్యంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో పోలీసులు పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. గడచిన రెండు రోజుల వ్యవధిలోనే 23 మంది పోలీసులు కరోనా బాధితులుగా మారారు.

మంగళవారం రోజు కరీంనగర్ వన్ టౌన్ స్టేషన్ కు చెందిన 15 మందికి కరోనా సోకగా, తాజాగా బుధవారం మరో ఎనిమిది మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా వైరస్ బారిన పడిన పోలీసుల సంఖ్య బుధవారం నాటికి 103కు చేరింది.

రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో కరీంనగర్ పోలీసు శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Popular Articles