Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

బ్యాలెట్ పద్థతిలో GHMC ఎన్నికలు

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణను బ్యాలెట్ పద్థతిలో నిర్వహించాలని తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి ఇందుకు కారణంగా ఈసీ పేర్కొంది. ఈ విషయంలో అన్ని పార్టీల అభిప్రాయాలను స్వీకరించాకే బ్యాలెట్ పద్ధతిలోనే GHMC ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్నికల సంఘం వివరించింది.

రాష్ట్రంలో 11 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉండగా, అందులో ఎనిమిది పార్టీలు ఈ విషయంలో అభిప్రాయాలను వెల్లడించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. స్థానిక ప్రభుత్వం సైతం బ్యాలెట్ పేపర్ వినియోగానికి సుముఖత వ్యక్తం చేయగా, బీజేపీ మాత్రం ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో GHMC ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల కావచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.

Popular Articles