Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

సూర్యాపేటలో కుప్పకూలిన కబడ్డీ గ్యాలరీ

సూర్యాపేటలో నిర్వహిస్తున్న జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. తాత్కాలికంగా నిర్మించిన ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలి దాదాపు 100 మంది గాయపడినట్లు సమాచారం. ఇక్కడ 47వ జాతీయ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు. మూడు గ్యాలరీలు నిర్మించగా, సామర్థ్యానికి మించి ప్రేక్షకులు గ్యాలరీల్లో కూర్చున్నారు. అయితే ఒక్కసారిగా గ్యాలరీ కుప్పకూలడంతో అక్కడ కూర్చున్న 1,500 మంది ప్రేక్షకుల్లో కనీసం వంద మంది గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Popular Articles