Top 5 This Week

Related Posts

ఖమ్మం పోలీస్ కమిషనర్ కు గ్యాలంటరీ అవార్డు

ఖమ్మం పోలీస్ కమిషనర్ కు శౌర్య పతకం (గ్యాలంటరీ అవార్డు) లభించింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతో ధైర్యసాహసాలతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందుకు గాను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ మెడల్-2024 కు ఎంపిక చేసింది. ఈమేరకు హైదరాబాద్ గోల్కొండ కోటలో శుక్రవారం జరిగిన స్వాతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్యాలంటరీ మెడల్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్వీకరించారు. తమ ఉన్నతాధికారికి ఈ అవార్డు రావడం పట్ల ఖమ్మం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Popular Articles