Top 5 This Week

Related Posts

కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్, ముఖ్యాంశాలు

జిల్లా కలెక్టర్లతో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు జారీ చేసిన కీలక ఆదేశాలకు సంబంధించిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

  • వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
  • అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేయాలి.
  • జూన్ నుంచి ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతం తక్కువనమోదైనా, గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
  • అన్ని విభాగాలు అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి.
  • భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో 150 బృందాలను ఏర్పాటు చేశాం.
  • వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ రూం నుంచి సమన్వయం చేసుకుని ముందుగానే టీంలను పంపిస్తున్నాం.
  • పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు గ్రౌండ్ లో ఉండాలి.
  • హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలి.
  • జిల్లాల్లో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలు నమోదు చేయాలి.
  • గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • పీహెచ్ సీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  • పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలి.
  • కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే.
  • కలెక్టర్లు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నా.
  • అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు.
  • ప్రతీ రోజు కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి రిపోర్టును అందించాలని సీఎస్ ను ఆదేశిస్తున్నా.
  • వర్షాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటికి సంబంధించి వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి.
  • 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచాం.
  • యూరియా స్టాక్ కు సంబంధించి ప్రతీ ఎరువుల షాప్ దగ్గర స్టాక్ వివరాలను బోర్డుపై డిస్ ప్లే చేయాలి.
  • స్టాక్ డిటైల్స్ ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  • ఎరువుల కొరత ఉన్నట్లు కొందరు కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నారు.
  • ఆందోళన అవసరం లేదు, కావాల్సినంత యూరియా స్టాక్ ఉంది.
  • ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోండి.
  • రైతుల కంటే ఏదీ ముఖ్యం కాదు.
  • ఎరువులకు సంబంధించి ఫిర్యాదులకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయండి.
  • రాష్ట్రంలో ఇప్పటి వరకు 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయి.
  • గతంలో రేషన్ షాపులపై ఆసక్తి ఉండేది కాదు.
  • సన్న బియ్యంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగింది.
  • రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగింది.
  • ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తీసుకోవాలి.
  • శాసనసభ్యులు, జిల్లా ఇంచార్జి మంత్రులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలి.
  • ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లు కో-ఆర్డినేట్ చేసుకోవాలి.
  • ప్రతీ మండలంలో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలి.

Popular Articles