ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలను ఎంపీ వద్దిరాజు రాజ్యసభలో ప్రస్తావించారు. భద్రాచలం రామాలయం అభివృద్ధి, ఖమ్మం నగరంలోని మధ్య రైల్వేగేట్ అండర్ బ్రిడ్జి నిర్మాణం, కాజీపేట రైల్వే డివిజన్, రద్దయిన పలు రైళ్ల గురించి రవిచంద్ర పార్లమెంటులో ప్రస్తావించారు. దాదాపు నాలుగున్నర నిమిషాలపాటు సాగిన తన ప్రసంగంలో ఎంపీ వద్దిరాజు ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలనే ప్రస్తావించడం విశేషం.
ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రసంగాన్ని దిగువన గల వీడియోలో చూడవచ్చు..

