Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్!

చర్ల: తెలంగాణా-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఇరువర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో నలుగురైదుగురు మావోయిస్టులు మరణించినట్లు ధ్రువపడని సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నక్సల్స్ ఏరివేతలో భాగంగా ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ పేరుతో నిర్వహిస్తున్న కూంబింగ్ ఇరువర్గాల మధ్య భారీ కాల్పులకు దారి తీసినట్లు తెలుస్తోంది.

మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు దేవ్ జీ, పాపారావు, బడే దామోదర్ తదితరులు టార్గెట్ గా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున కర్రెగుట్టల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నక్సల్స్ తో కాల్పులు జరుతున్న మాట వాస్తవమేనని, అయితే ఫలితం ఏమిటనే అంశంపై సమాచారం అందాల్సి ఉందని విశ్వసనీయ పోలీసు వర్గాలు చెప్పాయి.

Popular Articles