Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

నక్సల్స్ దుశ్చర్య: ఏఎస్ఐ కిడ్నాప్, దారుణ హత్య

మావోయిస్టు పార్టీ నక్సల్స్ ఓ పోలీసు అధికారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. నిన్న మధ్యాహ్నం సెలవుపై వెళ్లిన ఈ పోలీసు అధికారి మృతదేహాన్ని నక్సల్స్ రహదారిపై పడేశారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ పాల్పడిన దుశ్చర్యను బస్తర్ ఐజీ ధృవీకరించారు.

నక్సల్స్ ప్రభావిత బీజాపూర్ జిల్లాలో ఏఎస్ఐ నాగయ్య కోర్సా నిన్న సెలవుపై వెళ్లినప్పటి నుంచి కనిపించడం లేదు. కుట్లునార్-బీజాపూర్ మార్గంలోని రహదారిపై నాగయ్య నిర్జీవుడై కనిపించారు. నక్సలైట్లు నాగయ్యను అత్యంత దారుణంగా హత్య చేసి అతని డెడ్ బాడీని రోడ్డుపై పడేశారు. రోడ్డుపై గల మృతదేహం ఏఎస్ఐ నాగయ్యదిగా గుర్తించిన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

Popular Articles