Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ఖమ్మం ‘గాంధీచౌక్’లో మరో విషాదం

ఖమ్మం నగర వ్యాపార వర్గాల్లో మరో విషాదం అలుముకుంది. ఖమ్మం గాంధీచౌక్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారులు దేవత నాగప్రసాద్, నేరెళ్ల నారాయణరావులు కరోనా బారిన పడి ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ విషాదం నుంచి ఖమ్మం నగర వ్యాపారవర్గాలు తేరుకోకముందే ప్రముఖ అయిల్ వ్యాపారస్తుడు, కిరాణా, జాగిరీ మర్చంట్ అసోసియేషన్ గుంటుపల్లి విశ్వేశ్వరరావు అకాల మరణం చెందారు. ఆయన మృతికి సంతాప సూచకంగా ఎగుమతులు, దిగుమతులు సహా అన్ని దుకాణాలను శుక్రవారం బంద్ చేశారు.

Popular Articles