Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

తెలంగాణాలో పరీక్షలన్నీ వాయిదా

తెలంగాణాలో అన్ని రకాల పరీక్షలు వాయిదా పడ్డాయి. దసరా పండుగ ముగిసే వరకు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు, కరోనా‌ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఈ విషయంలో వివిధ వర్గాల నుంచి మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు పరీక్షల వాయిదాను కోరుతూ విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అన్ని పరీక్షలను వేయిదావేసే విషయాన్నిఆలోచించాలని మంత్రి కేటీఆర్‌ కూడా విద్యాశాఖ మంత్రిని కోరారు.

దీంతో దసరా పండుగ వరకు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

Popular Articles