ఖమ్మం: ఖమ్మం నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కూసుమంచి మండలం జీళ్లచెరువు నుండి వచ్చే మిషన్ భగీరథ , RWS గ్రిడ్ కు సంబంధించిన ప్రధాన పైప్లైన్లో లీకేజ్ ఏర్పడిన కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. సంబంధిత శాఖ మరమ్మత్తు పనులు చేపట్టిందని, ఫలితంగా ఈనెల 10వ తేదీన నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఖమ్మం నగర పాలక సంస్థ అధికారిక ప్రకటనలో వెల్లడించింంది.
- శనివారం నీటి సరఫరా నిలిచే ప్రాంతాలు ఇవే:
- శ్రీనివాస నగర్
- టీచర్స్ కాలనీ
- ప్రకాశ్ నగర్
- గాంధీ చౌక్
- మోతీ నగర్
- రంగనాయకుల గుట్ట
- నయా బజార్
- రామన్నపేట
- దానవాయిగూడెం
- ఖానాపురం
- బల్లేపల్లి
- బాలపేట
- పాండురంగపురం
- జె. నగర్ కాలనీ
- వైఎస్సార్ కాలనీ
- వెలుగుమట్ల
- రోటరీ నగర్
- టేకులపల్లి
- 2BHK కాలనీ
- ఆర్కే నగర్
- గొల్ల గూడెం
- ఎస్బీఐటీ ప్రాంతం
- న్యూ కలెక్టరేట్ ప్రాంతం
నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి, అవసరమైన మేరకు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ అంశంలో నగరపాలక సంస్థకు సహకరించాలని, మరమ్మత్తు పనులు పూర్తయిన వెంటనే తాగునీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

