Top 5 This Week

Related Posts

ఖమ్మంలో తాగునీటి సరఫరాకు బ్రేక్, ఏయే ప్రాంతాలంటే..?

ఖమ్మం: ఖమ్మం నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కూసుమంచి మండలం జీళ్లచెరువు నుండి వచ్చే మిషన్ భగీరథ , RWS గ్రిడ్ కు సంబంధించిన ప్రధాన పైప్‌లైన్‌లో లీకేజ్ ఏర్పడిన కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. సంబంధిత శాఖ మరమ్మత్తు పనులు చేపట్టిందని, ఫలితంగా ఈనెల 10వ తేదీన నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఖమ్మం నగర పాలక సంస్థ అధికారిక ప్రకటనలో వెల్లడించింంది.

  • శనివారం నీటి సరఫరా నిలిచే ప్రాంతాలు ఇవే:
  • శ్రీనివాస నగర్
  • టీచర్స్ కాలనీ
  • ప్రకాశ్ నగర్
  • గాంధీ చౌక్
  • మోతీ నగర్
  • రంగనాయకుల గుట్ట
  • నయా బజార్
  • రామన్నపేట
  • దానవాయిగూడెం
  • ఖానాపురం
  • బల్లేపల్లి
  • బాలపేట
  • పాండురంగపురం
  • జె. నగర్ కాలనీ
  • వైఎస్సార్ కాలనీ
  • వెలుగుమట్ల
  • రోటరీ నగర్
  • టేకులపల్లి
  • 2BHK కాలనీ
  • ఆర్‌కే నగర్
  • గొల్ల గూడెం
  • ఎస్‌బీఐటీ ప్రాంతం
  • న్యూ కలెక్టరేట్ ప్రాంతం

నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి, అవసరమైన మేరకు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ అంశంలో నగరపాలక సంస్థకు సహకరించాలని, మరమ్మత్తు పనులు పూర్తయిన వెంటనే తాగునీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Popular Articles