Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

కేసీఆర్ బర్త్ డే: ఆంధ్రాలో వినూత్న అభిమానం

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ నర్సరీ నిర్వాహకుడు తెలంగాణా సీఎం కేసీఆర్ పై వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈనెల 17న కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకోవడం విశేషం. తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో కేసీఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో ప్రేరణ పొంది తాము ఈ విధంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపామని వారు తెలిపారు. తెలంగాణేతర ప్రజలు ఈ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం పలువురిని ఆకర్షించింది.

Popular Articles